ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆసినిమాలో నటించిన హీరో హీరోయిన్ ప్రవర్తనలో అనేక మార్పులు వస్తాయి. తాము ఒప్పుకున్న సినిమాల కథల విషయంలో మార్పులు చేయమని అదేవిధంగా తమ పారితోషికాన్ని పెంచమని ఇలా రకరకాలుగా హీరో హీరోయిన్స్ దర్శక నిర్మాతల పై ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి విధానం సిద్దు జొన్నలగడ్డ లో కూడ కనిపిస్తోంది అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.



‘డీజే టిల్లు’ తో స్టార్ గా మారిపోయిన సిద్దు ఆసినిమా సూపర్ సక్సస్ తో ఇండస్ట్రీలో సెలెబ్రెటీగా మారిపోయాడు. ‘డీజే టిల్లు’ విడుదలకు ముందు సిద్దు ‘బుట్టబొమ్మ’ మూవీ కథకు ఓకె చేసాడు. అయితే ‘డీజే టిల్లు’ తన ఇమేజ్ మారిపోయింది అన్న నెపంతో ఆమూవీని క్యాన్సిల్ చేసుకున్నాడు అన్న మాటలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘డీజే టిల్లు 2’ కథ విషయంలో వచ్చిన మార్పులకు అదేవిధంగా దర్శకుడు హీరోయిన్ విషయంలో వచ్చిన మార్పులకు సిద్దు ఇచ్చిన సలహాలే కారణం అంటూ గాసిప్పులు కూడ వచ్చాయి.


ఇక ఇది ఇలా ఉంటే ‘డిజే టిల్లు 2’ లో నటిస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను కూడ ఈమూవీ నుంచి పంపించివేసారు అన్న గాసిప్పులు కూడ వస్తున్నాయి దీనికి కూడ కారణం సిద్దు అని అంటున్నారు. ఆమె స్థానంలో ‘ప్రేమమ్’ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ఎంపిక అయింది అంటున్నారు.



వాస్తవానికి అనుపమ ను ఎందుకు తప్పించారు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ‘కార్తికేయ 2’ సూపర్ హిట్ తరువాత ఆమె తీరులో కొద్దిగా మార్పులు రావడమే కాకుండా డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోవడం కూడ ఒక కారణం అన్న గాసిప్పులు వస్తున్నాయి. సిద్దూ కెరియర్ కు సంబంధించి వచ్చే సంవత్సరం విడుదల కాబోతున్న ‘డిజే టిల్లు 2’ చాల కీలకం. ఆసినిమా కూడ బ్లాక్ బష్టర్ హిట్ అయినప్పుడు మాత్రమే సిద్దు రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: