సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించారు. ఆయన లేరనే విషయాన్ని కృష్ణ కుటుంబసభ్యులే కాదు.. అభిమానులు కూడా మర్చిపోలేకపోతున్నారు. రీసెంట్ గా జరిగిన పెదకర్మ కార్యక్రమంలో మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ కూడా బావోద్వేగానికి గురయ్యారు. అయితే కృష్ణ కుటుంబంలో మహేశ్ బాబు ఫ్యామిలీ గురించి మాత్రమే తెలుసు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు బావ రమేశ్ బాబు కూతురితో నమ్రత పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు, అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా సరే తెలుగులో కోట్లాది మంది అభిమానులు ఇతడికి ఉన్నారు. ఇక కృష్ణ వారసుల్లో మహేశ్ మాత్రమే హీరోగా సక్సెస్ అయ్యాడు. రమేశ్ బాబు, మంజులు కూడా స్క్రీన్ పై కనిపించారు కానీ పెద్దగా ఆదరణ అయితే దక్కించుకోలేదు. దీంతో వారు ఏం చేస్తున్నారనేది కృష్ణ అభిమానులకు పెద్దగా తెలిసేది కాదు. మహేశ్, ఇతడి భార్య నమ్రతో పాటు పిల్లలు గౌతమ్, సితార అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. కానీ రీసెంట్ గా కృష్ణ మరణంతో విదేశాల్లో ఉంటున్న రమేశ్ బాబు పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చారు.ఇక తండ్రి రమేశ్ బాబులానే అందంగా ఉన్న ఆయన కొడుకు జయకృష్ణ.. హీరో అయ్యేలా కనిపిస్తున్నాడు. మరోవైపు రమేశ్ బాబు కూతురు భారతి కూడా చూడచక్కగా అనిపించింది. ఇప్పుడు సితార, భారతితో కలిసి తీసుకున్న ఓ ఫొటోని మహేశ్ భార్య నమ్రత ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ‘ఈ ఇద్దరమ్మాయిల వల్లే ఇంట్లో నవ్వొలొచ్చాయి’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక బావ రమేశ్ బాబు కూతురి ఫొటో నమ్రత షేర్ చేయడంతో.. సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. అమ్మాయిలిద్దరూ చుడముచ్చటగా ఉన్నారని నెటిజన్స్ అంటున్నారు. మరి నమ్రత సెల్ఫీ మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: