నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కావడం , క్రాక్ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రాబోతున్న మూవీ కావడంతో వీర సింహా రెడ్డి మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

ఈ క్రేజీ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా , దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఈ మూవీ యూనిటీ ఇప్పటివరకు ప్రకటించలేదు.

ఇది ఇలా ఉంటే వీర సింహా రెడ్డి మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తేరకేక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: