తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమంత గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఎన్నో సినిమాలలో నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకొని.. అక్కినేని కోడలుగా వెళ్లిన సమంత నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపింది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ గొడవలకు గల కారణం ఏమిటి అని ఇప్పటివరకు కూడా ఎవరు చెప్పకపోవడం గమనార్హం.


స్టార్ సెలబ్రిటీలు కావడంతో విడాకులు జరిగి ఏడాదికి పైగా అవుతున్నప్పటికీ ఇంకా విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అన్నది మాత్రం తెలియలేదు.. అంతేకాదు ఇప్పటికీ వీరిద్దరి విషయంపై ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. ఇకపోతే విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు.  మరోపక్క నాగచైతన్య థాంక్యూ,  లాల్ సింగ్ చద్దా వంటి సినిమాలతో భారీ డిజాస్టర్ ను చవి చూడగా.. సమంత ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదట్లో మిక్స్డ్ టాక్ ను  సొంతం చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ ఉండడం గమనార్హం.


అయితే ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుందని అందరూ ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఈ సినిమాలో చూపించిన హాస్పిటల్ "ఎవ".. తమ హాస్పిటల్ పేరును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.  దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ ఆగిపోయింది.  కానీ విచారణ తర్వాత స్ట్రీమింగ్ విడుదలకు అంగీకరించిన కోర్టు ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాన్ని కూడా తాజాగా హార్డిల్స్ క్లియర్ చేశారు. డిసెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది అని క్లారిటీ ఇచ్చారు. ఓటీటీ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: