బిగ్ బాస్ లోకి వెళ్లిన కాంటేస్తేంట్ లో గీతూ ఒకరు.. ఈమె ప్రేక్షకులను కాస్త ఇరిటేషన్ తెప్పించినా సరే. ఈ రోజు ఏం చేస్తుందో అంటూ ఆసక్తితో చూశారు ప్రేక్షకులు మరీ.

అలా గీతూ కావాల్సినంత ఫుట్టేజ్ ఇచ్చింది. బిగ్ బాస్ చెప్పింది కూడా పట్టించుకోకుండా నా స్ట్రాటజీ, నా గేమ్, నా ఇష్టం అంటూ ఆడింది గీతూ రాయల్.. ఇక ఈ చిన్నది ఎలిమినేట్ అయిన తర్వాత బోరున  బాగా ఏడ్చింది. హౌస్ లో ఉన్నప్పుడు నన్ను ఏడిపించు బిగ్ బాస్ అని సవాల్  కూడా విసిరిన గీతూ..

ఇప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తూ రోజు ఏడుస్తోంది మరీ. అంతే కాదు ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. కప్పు కొట్టేది నేనే గెలిచేది నేనే అని బీరాలు పోయిన గీతూ టాప్ 5లో అయినా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ప్రేక్షకులు ఆమె ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంటర్వ్యూ ల్లో కనిపించని గీతూ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది.

బిగ్ బాస్ తర్వాత డిప్రషన్ లో కి వెళ్లిందట ఈ నటి.. అందుకే బయట ఎక్కువుగా కనిపించలేదట.. మొన్నీమద్యే నాగార్జున గారిని కుడా కలిసింది గీతూ.. అక్కడ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది.

ఇక బయటకు వచ్చిన గీతూ చేసిన పని ఏంటో తెలుసా.. చిత్తూరు చిరుత అని చెప్పుకున్న గీతూ తాజాగా చిరుత ట్యాటూను కూడా వేయించుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన గీతూ.. 20 రోజుల తరువాత బయటకు వచ్చాను.

ఓ పని మీద బయటకు వచ్చాను.. అది ఎక్కడికి అంటే.. హెయిర్ కలర్ కోసం.. కాలిపై టాటూ కోసం.

నా లైఫ్‌లో చేయని పనులు చేస్తున్నా.. నా కాలికి  సైలెన్సర్ కాలిన పెద్దా మచ్చ ఉంది.. ఆ మచ్చని.. చిరుత మచ్చలతో కవర్ చేద్దాం అని ఈ చిరుత చారలు టాటూగా వేయించుకున్నాను' అంటూ  ఇలా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: