రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు స్థాయి ప్రపంచానికి తెలిసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు రాజమౌళి రూపొందించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్.చత్రపతి, విక్రమార్కుడు, బాహుబలి ఇంకా అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేశాయి. అయితే రాజమౌళి టేకింగ్ పై హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఎంతగానో ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలకు స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో ఇంకా అలాగే స్క్రిప్ట్ కూడా అంతే ముఖ్యం. ఇక ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు స్టోరీ అందిస్తున్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఈగ, బజరంగీ భాయిజాన్, బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి హిట్  సినిమాలకు ఆయనే స్టోరీస్ అందించారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినే షన్లో రాబోతున్న సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండనుందని గతంలో విజయేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ తో ఈ మూవీపై అంచనాలు చాలా భారీగా పెరిగాయి. తాజాగా ఈ మూవీ కోసం రాజమౌళి మహేష్ ను ఎంచుకోవడానికి గల కారణాలు రివీల్ చేశారు.


ఇక రాజమౌళి సినిమాలో మహేష్ నుంచి ఎలాంటి స్పెషల్ ఎలిమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేయవచ్చని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మహేష్ బాబు గారు చాలా ఇంటెన్స్ యాక్టర్. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూస్తే ఎంతో ఇంటెన్స్ గా ఉంటాడో ఇంకా ఎంత అగ్రెసివ్ గా నటిస్తాడో తెలుస్తుంది. అది ఏ రైటర్ కి అయినా కూడా అడ్వాంటేజ్ ఎలిమెంట్. మహేష్ బాబు ఏ పాత్రలోకైనా చాలా సులభంగా షిఫ్ట్ కాగలడని.. ఇది ప్రతి రైటర్ పనిని సులభం చేస్తుందని అన్నారు.ఇక తన కొడుకు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. చాలా కాలంగా నా కొడుకు అడవిలో సాహసం వంటి సినిమా చేయాలనుకున్నాడు. కానీ తనకి ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు ఇలాంటి స్టోరీకి సూపర్ స్టార్ మహేష్ బాబు బెస్ట్ ఎంపిక అని  భావించాడు. ఆయన పాత్రకు తగినట్టుగా స్టోరీ రాయడం ప్రారంభించాము అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా అలాగే అంతేకాకుండా.. ఈ సినిమాని వచ్చే ఏడాది మే లేదా జూన్ నుంచి రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: