తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు..  సూపర్ స్టార్ మహేష్ .. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా సర్కారువారి పాట తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా లు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో .ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మహేష్ , త్రివిక్రమ్. ఈ షూటింగ్ ఇటీవలే మొదలైంది.


మహేష్ ఇంట వరుస విషాదాలు నెలకొనడంతో ఈ షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది. త్వరలోనే మహేష్ తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇదిలా ఉంటే ఈ తర్వాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహేష్ తో ఓ అడ్వెంచర్ మూవీ చేయనున్నారు జక్కన్న. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ కథను సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఈ ఉంటుందని టాక్.


ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో జక్కన్న మాట్లాడుతూ.. ఇండియానా జోన్స్ ఫ్రాంఛైజీ మూవీస్ జోనర్ లో మహేష్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు గురించి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతుంది.మహేష్ బాబు ఇంటెన్స్ ఉన్న యాక్టర్.. అతను నటించిన యాక్షన్ సీన్స్ చూసినప్పుడు వెరీ ఇంటెన్సిటివిటీ కనిపిస్తుంది..అని అన్నారు విజయేంద్ర ప్రసాద్. మహేష్ ఇంటెన్స్ కారణంగా ఏ రచయితకైనా తన పని సులభం అవుతుంది.. చాలా మంది రైటర్స్ మహేష్ గురించి అదే అన్నారు.. ఈ విషయం పై ఆయన ఫ్యాన్స్ ఫిధా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: