తాజాగా అనౌన్స్ చేసిన ఒక ప్రకటన తెలుగు రాష్ట్రాల సినిమా వర్గాల్లో పలు చర్చలకు తావిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో ఏ స్థాయి అభిమానాన్ని పొందాడు అన్నది అందరికీ తెలిసిందే. ఇతని సినిమాలు వచ్చాయంటే ఒక జాతరలాగా పోటెత్తి వస్తారు అభిమానులు. అయితే తాను రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ సినిమాలలో వేగం తగ్గించాడు, కానీ అభిమానులు మాత్రం పవన్ నుండి మునుపటిలాగా ఏడాదికి రెండు మూడు సినిమాలను ఆశిస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రానున్న "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమాను వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా ఎప్పుడు పూర్తి అవుతుందో అంచనా వేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే... తాజాగా పవన్ తో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. రన్ రాజా రన్ తో సక్సెస్ ను అందుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్  ఆ తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. కానీ ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి. సాహూ తో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించినప్పటికీ టేకింగ్ లో లోపాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాడు సుజీత్.

సినిమా ఫెయిల్యూర్ తో కనుమరుగైపోయిన సుజీత్ మంచి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని పవన్ హీరోగా పెట్టి సినిమా తీయడానికి శ్రీకారం చుడుతున్నాడు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి డి వి వి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ ముందుకు రావడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. దీనికి ఓ జి అన్న టైటిల్ ను ఖరారు చేశారు.. దీనితో ఇండస్ట్రీ అంతా ఎందుకు పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ చర్చించుకుంటున్నారు. పవన్ సుజీత్ తో సినిమా చేయడం సబబేనా ? అన్న విషయం తెలియాలంటే ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: