నేచురల్ బ్యూటీగా అందం నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు .డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది .అనంతరం ఎంసీఏ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయి సినిమాలు చేసింది .తెలుగుతో పాటు తమిళ్ మలయాళం లో కూడా నటించింది .సాయి పల్లవి చివరిగా ఈమె గార్గి సినిమాతో ప్రశంసలు అందుకున్నప్పటికీ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంది. 

అయితే సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజకన్నన్ తో కలిసి హాస్పిటల్ నిర్మిస్తుందని సినిమాలకు గుడ్ బై చెప్పానుందని వార్తలు వినిపించాయి .ఇప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు అయితే తాజాగా సాయి పల్లవి ఫిలిం కెరియర్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. అయితే ఇప్పటివరకు దక్షిణాది సినిమాల లోనే కనిపించిన ఈమె ఇప్పటినుండి బాలీవుడ్ లో కూడా నటించనుందని రాబోయే సినిమలో రణబీర్ కపూర్ కు జోడిగా సాయిపల్లవి నటించినుందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చేయడాది వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలెక్కని ఉందని తెలుస్తోంది .

సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారట..ఆ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటించనుందని సమాచారం. రాముడిగా రణ్బీర్ కపూర్ నటిస్తారని...అయితే ఇంతకుముందు సీత పాత్ర కోసం దీపిక పదుకొనే, కరీనా కపూర్ లను తీసుకుందామని అనుకున్నారట ...కానీ చివరికి సాయి పల్లవి నీ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది .. మరోవైపు ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా కాకుండా రావణుని పాత్రలో చేస్తున్నారట... సాయి పల్లవి రణబీర్ కపూర్ జోడిగా చేసేందుకు నార్త్ ఆడియన్స్ సైతం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు .ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: