తమిళ్ లో 2015 లో వచ్చిన "వేదాళం" మూవీ గురించి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ గత సంవత్సరం నుండి మాత్రం ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. దీనికి కారణం ఈ సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయడానికి నిర్ణయం తీసుకోవడమే. తమిళ్ లో అజిత్ కుమార్ హీరోగా చేయగా , శృతి హాసన్ మరియు లక్ష్మి మీనన్ లు ఇతర పాత్రలలో నటించారు.. ఈ సినిమాను డైరెక్టర్ శివ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సక్సెస్ అయ్యారు. ఇందులో ఒక చెల్లిని ఒక గ్యాంగ్ నుండి కాపాడుకునే అన్నయ్యగా అజిత్ నటన వేరే లెవెల్ అని చెప్పాలి.

ఇప్పుడు ఈ కథను "భోళా శంకర్" అన్న టైటిల్ తో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. అజిత్ నటించిన పాత్రలో టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ చేతుల్లో ఉంది. కొన్ని వర్గాల్లో ఈ విషయంపై సందేహాలు ఉన్నా , కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా తెరకెక్కిస్తానన్న నమ్మకాన్ని చిరు అభిమానులకు ఇచ్చాడు అని చెప్పాలి. కానీ ఈ సినిమాపై అందుకు తగిన బజ్ క్రియేట్ కావడం లేదన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. భోళా శంకర్ లో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుండగా , సినిమాకు ప్రాణం అయిన చిరు చెల్లెలి పాత్రలో మహానటి ద్వారా మహానటిగా ప్రసిద్ధి చెందిన కీర్తి సురేష్ నటిస్తోంది.

ఇక ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా అనిల్ సుంకర నిర్మించడానికి ప్లాన్ అంతా సిద్ధం చేసుకున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం జనవరి నుండి షూటింగ్ స్టార్ట్ అయ్యి... వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారట. మరి ఇప్పటికే ఒక రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న చిరు , మరో రీమేక్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెడతారా లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.    


మరింత సమాచారం తెలుసుకోండి: