ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ అవడంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాన్ని చవిచూశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తన పర్యవేక్షణలోనే సినిమాకు సంబంధించిన ప్రతి సీన్..షూటింగ్ ను దగ్గరుండి ఆయన చూసుకోవడం జరిగింది. అందువల్లే ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన నటిస్తున్న భోళాశంకర్ సినిమా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. మరో 25 రోజులపాటు షూటింగ్ చేయడానికి ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల డేట్స్ కూడా చిత్ర బృందం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా మినిమం గ్యారంటీ అనే విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు చిరంజీవి. అయితే కొన్ని సన్నివేశాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోని విధంగా ఉంటాయని గమనించిన చిరంజీవి సినిమాలో మార్పులు చేర్పులు చేయడానికి కూడా సన్నహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగు పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మిల్క్ బ్యూటీ తమన్న.. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న ఈమె.. షూటింగ్ ఇంకా ప్రారంభించలేదు.  వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది.  ప్రస్తుతం మేము ఇంకా షూటింగ్లో పాల్గొనలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2015 తమిళ చిత్రం వేదాళం రీమేక్గా తెరకెక్కించబోతున్నారు.. ఇందులో తమన్నా , కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భోళా శంకర్ సినిమాను 2023 ఏప్రిల్ 14వ తేదీన థియేటర్ లలో విడుదలకు సర్వం సిద్ధం చేస్తున్నారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో రష్మీ గౌతమ్ ఆడి పాడనున్నారు.  అంతేకాదు మురళీ శర్మ,  వెన్నెల కిషోర్,  గెటప్ శ్రీను, శ్రీముఖి , సత్య,  ప్రగతి , రఘుబాబు, రావు రమేష్  తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: