కన్నడ సినిమా ఇండ స్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక కన్నడ సినిమా లలో నటించిన రిషబ్ శెట్టి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టి "కాంతారా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. కొంత కాలం క్రితం విడుదల అయినా కాంతారా మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా రిషబ్ శెట్టి కి పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపు లభించింది.

కాంతారా మూవీ తెలుగు లో అక్టోబర్ 15 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్  ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన రిషబ్ శెట్టి ఈ సంవత్సరం తమిళ సినిమా "లవ్ టుడే" నాకు చాలా ఇష్టమైన సినిమా అని చెప్పుకొచ్చాడు. అలాగే కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన చార్లీ 777 సినిమా తనకు నచ్చిన అత్యుత్తమమైన సినిమా అని రిషబ్ శెట్టి తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: