ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుకు మరోసారి ఎదురుచూపులు తప్పవా..? యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను నమ్ముకుంటే వెయిటింగ్ తప్ప ఏం లేదని తెలుసుకుని.. తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైపు వచ్చిన ఈ దర్శకుడికి..ఇక అక్కడ కూడా ఎదురు చూపులే పలకరించబోతున్నాయా..? ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవ్వడానికి రీజన్ ఏంటి..? డైరెక్టర్ శంకర్ తర్వాత బుచ్చిబాబు కాకుండా మరో దర్శకుడి వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్తున్నారా..? అనే డౌట్స్ ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోతుంది.. అదృష్టం అనేది తర్వాత మ్యాటర్ అని అంటుంటారు. కానీ అందులో నిజం లేదని దర్శకుడు బుచ్చిబాబును చూస్తుంటే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇతనికి బోలెడంత టాలెంట్ ఉంది.. కథ రెడీగా ఉంది.. నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు.. కానీ హీరో మాత్రం దొరకడం లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను కాదని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైపు వస్తే.. ఇక్కడ కూడా ఇక ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు.


2021 వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఉప్పెన సినిమా విడుదలైంది. ఆది విడుదలైన మూడు నెలలకే ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసిన ఈ దర్శకుడు.. అప్పట్నుంచి ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.ఇంకా ఈ మధ్యే మనసు మార్చుకుని.. రామ్ చరణ్ వైపు మళ్ళాడు బుచ్చిబాబు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇంకా విృద్ధి స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే శంకర్ తర్వాత.. వెంటనే ఈ మూవీను మొదలు పెట్టడానికి చరణ్‌కు కొన్ని ఇబ్బందులున్నాయి.శంకర్ తర్వాత యువీ క్రియేషన్స్‌తో కూడా ఒక సినిమాకు కమిటయ్యారు రామ్ చరణ్. అది గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాల్సిన సినిమా. అది ఆగిపోయింది. ఈ లోపు బుచ్చిబాబు కథని ఓకే చేసారు రామ్ చరణ్. అయితే యువీ క్రియేషన్స్ వాళ్ళ తర్వాతే బుచ్బిబాబు సినిమా సెట్స్‌పైకి వస్తుందని తెలుస్తుంది.. లేదంటే రెండూ సినిమాలు ఒకేసారి చేస్తారా అనేది ఆసక్తికరమే. ఇక ఎలా చూసుకున్నా కూడా ఉప్పెన దర్శకుడికి మరోసారి వెయిటింగ్ తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: