మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి తాప్సి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాప్సి తెలుగు లో ఝుమ్మంది నాదం మూవీ తో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన తాప్సి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అలాగే ఎన్నో సంవత్సరాల పాటు ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా  కెరియర్ ను కొనసాగించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దు గుమ్మ కు మంచి సిన అవకాశాలు దక్కడం ,  ఆ సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. కొన్ని రోజుల క్రితమే తాప్సి "మిషన్ ఇంపాజిబుల్" అనే తెలుగు మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా తాప్సి ... మంచి స్టోరీ దొరికితే ఈగోని పక్కన పెడతాను అని ,  పాత్ర ... బడ్జెట్ ... బ్యానర్ ఇవేమీ ఆలోచించను అని ,  ఎవరు ఏమి అనుకుంటారు అని అస్సలు పట్టించుకోను అని చెప్పుకొచ్చింది. అలాగే జీవితం , కెరియర్ ఎవరికీ కూడా పూల దారి వేయదు అని మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాం. ఏం చేసినప్పటికీ కొందరిని సంతృప్తి పరచలేం ,  అలాంటప్పుడు ప్రతి విమర్శ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తాప్సి తాజాగా చెప్పకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: