నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని అద్భుతమైన ఊర మస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో నాని సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించింది. అలాగే ఈ మూవీ షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ చాలా వేగంగా పూర్తి చేస్తూ వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను నాని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

తాజాగా నాని తన సోషల్ మీడియా వేదికగా దసరా మూవీ ఆఖరి షెడ్యూల్ మొదటి రోజు ఈ రోజు నుండి ప్రారంభం అయింది అని , ఈ షెడ్యూల్ లో అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాము అని నాని తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంటే సుందరానికి మూవీnతో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన నానిమూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: