తాజాగా రవితేజ క్రాక్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ తో కలసి నటిస్తున్న మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం వీరసింహారెడ్డి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు, టీజర్ , పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఇప్పుడు మూడవ పాట కూడా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇప్పటికే జై బాలయ్య, సుగుణసుందరీ అంటూ సాగే ఈ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు "మా బావ మనోభావాలు "అంటూ సాగే పాటను డిసెంబర్ 24 మధ్యాహ్నం 3:19 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ రెండు పాటలు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరి ఈ మూడో పాట ఏ రేంజ్ లో రికార్డు సాధిస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ మూడో  పాట కోసం కూడా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే బాలకృష్ణ విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకొక వైపు ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ వన్ దిగ్విజయంగా పూర్తి చేసి.. సీజన్ 2 ని కూడా చాలా రసవత్తరంగా పూర్తి చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు.. సినీ సెలబ్రిటీలు.. కనుమరుగైన సీనియర్ హీరోయిన్లు కూడా ఈ షో కి వచ్చి తెగ సందడి చేస్తున్నారు. ఇకపోతే డిసెంబర్ 30వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్ కి  రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరు కాబోతున్నారు.  ఇప్పటికే ఈ షో కి సంబంధించిన ప్రోమో వైరల్ అవ్వగా ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ సక్సెస్ లో దూసుకుపోతున్న బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: