తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ , ఏఎన్నార్లతో కలిసి ఎన్నో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత డి రామానాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. అప్పట్లోనే అతిపెద్ద నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న వీరి ప్రొడక్షన్ సంస్థ ఎన్నో చిత్రాలను తెరకెక్కించడమే కాదు మరి ఎంతో మందికి జీవితాలను కూడా ప్రసాదించింది. ఇది ఇలా ఉండగా ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. 1985లో కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన వెంకటేష్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఆ తరువాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులకు దగ్గరయిన ఈయన కామెడీ టైమింగ్ తో అభిమానులను కడుపుబ్బ నవ్వించేవాడు.  ఇప్పటికి కూడా వయసు మీద పడుతున్నా తన లోని కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఏకైక హీరో వెంకటేష్ అని చెప్పవచ్చు. ఒకపక్క మాస్ హీరో అనిపించుకుంటూనే మరొక పక్క ఫ్యామిలీ హీరోగా చెరగని ముద్ర వేయించుకున్న ఈయన  ఏ సినిమాలో నటించిన సరే అందులో తన మార్కు చూపిస్తూ ఉంటాడు.  ఈ క్రమంలోనే తాజాగా సినిమాలలో హీరోగా నటిస్తూనే మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషిస్తున్నారు.

అలా తాజాగా వెంకటేష్ నటించిన చిత్రం ఓరి దేవుడా.. ఇందులో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. వెంకటేష్ దేవుడి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇక ప్రస్తుతం ఈయన  నుంచి సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అభిమానులకు మరింత గుడ్ న్యూస్ చెప్పారు. వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా తర్వాత చేయబోతున్న ఈ చిత్రానికి #వెంకటేష్ 75 అనే వర్కింగ్ టైటిల్ తో హిట్ చిత్రాల ద్వారా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే హిట్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న శైలేష్ కొలను తో వెంకటేష్ సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా విజయం సాధించినట్టే అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: