ఈ ఏడది బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకున్న సినిమాలలో త్రిబుల్ ఆర్ సినిమా మొదటి స్థానంలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 1000 కోట్ల రూపాయల కలెక్షన్లకు పైగానే అందుకుంది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరికెక్కించడం జరిగింది. అయితే తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతుంది అని రాజమౌళి చెప్పినట్లుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ  సినిమాకి సంబంధించిన సీక్వెల్ కథను కూడా సిద్ధం చేశారని ఒక పాపులర్ మ్యాగజైన్లో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజమౌళి. 

త్రిబుల్ ఆర్ సినిమాలో హీరోలుగా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నారని రాజమౌళి చెప్పుకొచ్చాడు.దానికి సంబంధించి మేము కసరత్తులను కూడా చాలా తీవ్రంగా చేస్తున్నామని తెలియజేశాడు. త్రిబుల్ ఆర్ సినిమా కంటే ఇది చాలా వెరైటీగా ఉంటుందని రాజమౌళి చెప్పాడు. ప్రస్తుతం రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించిన ఆస్కార్ ప్రచారభరిలో బిజీగా ఉన్నాడు. ఇక విజయేంద్ర ప్రసాద్సినిమా కథకి సంబంధించిన పనిలో చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు త్రిబుల్ ఆర్ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలో కూడా మరోసారి విప్లవ వీరులు కనిపిస్తారని సమాచారం. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమా రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లను అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకున్న నాటు నాటు పాట ఉత్తమ ఆంగ్ల భాష సినిమాగా కూడా రికార్డును బద్దలు కొట్టింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఆయన 29వ సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెల్ ను తెసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: