బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా లలో నటిస్తూనే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ టాక్ షో కు రెబల్ స్టార్ ప్రభాస్ మరియు మ్యచో స్టార్ గోపీచంద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి అయింది. అలాగే కొన్ని రోజుల క్రితమే వీరికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో ను కూడా ఆహా నిర్వాహక బృందం విడుదల చేసింది.

అలాగే ఈ ఎపిసోడ్ ను డిసెంబర్ 30 వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్టు కూడా ఆహా నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటించింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా నిర్వాహక బృందం ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లోని ప్రభాస్ మరియు గోపీచంద్ లకు సంబంధించిన ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఆహా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

అందులో భాగంగా మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 30 వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు ... అలాగే రెండవ భాగాన్ని వచ్చే సంవత్సరం జనవరి 6 వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా ఆహా యూనిట్ విడుదల చేసింది . ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ లోకి వస్తుందా ... అని ఎంతో మంది బాలకృష్ణ ... ప్రభాస్ ... గోపీచంద్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా చాలా ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: