ఒకప్పుడు బుల్లితెరపై ఈటీవీ ఛానల్ అంటే ప్రేక్షకులు మెచ్చిన ఛానల్ గా ఉండేది. అంతేకాదు ప్రేక్షకుల మదికి దగ్గరైన ఛానల్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ టీవీని కేవలం రెండు మూడు షోలు మాత్రమే నిలబెడుతూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేటి రోజుల్లో పోటీని తట్టుకునేందుకు ఈటీవీలో ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తున్న ఎందుకో పాత కార్యక్రమాలే ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి అని చెప్పాలి. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, ఆలీతో సరదాగా, సుమ క్యాష్ షో మినహా ఏ సీరియల్ కూడా ఈటీవీని కాపాడలేకపోతున్నాయని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది.


 అయితే ఇక ఇలా ఈటీవీ నిలబెడుతున్న షోలే మరికొన్ని రోజులు ఆగిపోబోతున్నాయి అన్న ప్రచారం కూడా మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆలీతో సరదాగా అనే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే కొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తా అంటూ అలీ ప్రకటించాడు. అదే సమయంలో ఇక క్యాష్ అనే షోతో ఈటీవీకి వెన్నుముకగా నిలుస్తున్న సుమ సైతం ఇక బ్రేక్ తీసుకోబోతున్నానంటూ ప్రకటించి షాక్ ఇచ్చింది. ఈ రెండు షోలు కూడా రేటింగ్స్ పరంగా ఈటీవీని నిలబెడుతూ ఉన్నాయి. మరీ ఈ రెండు షోలు క్లోజ్ అయితే ఈటీవీ పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈటీవీ నిర్వాహకులు ఎలాంటి ప్లాన్ తో ముందుకు వెళ్తారు అన్నది చూడాలి మరి.

 అయితే అటు క్యాష్, ఆలీతో సరదాగా కార్యక్రమాలు క్లోజ్ అయినప్పటికీ జబర్దస్త్, ఢీ షోలు మాత్రం టాప్ రేటింగ్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ కేవలం రెండే రెండు షోలతో ఈటీవీని ముందుకు నడిపించడం అంటే అది అసాధ్యమైన పని అని ఎంతో మంది నిపుణులు చెప్పే మాట. ఈ క్రమంలోనే ఈటీవీలో రానున్న రోజుల్లో ఎలాంటి కొత్త కార్యక్రమాలు దర్శనం ఇవ్వబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv