ప్రస్తుతం ఈటీవీలో ఎన్నో రకాల కామెడీ షోస్ ప్రసారం అవుతున్నాయి అని చెప్పాలి. కేవలం పేరుకు మాత్రం జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ మాత్రమే కామెడీ షోస్ గా కొనసాగుతున్నప్పటికీ మిగతా షోస్ కూడా జబర్దస్త్ కు మించి ఎంటర్టైన్మెంట్ పంచుతూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయి అని చెప్పాలి. చివరికి డాన్సులు కనిపించాల్సిన ఢీ షోలో కూడా ఇక కామెడీ పంచలతో నింపేసి ప్రేక్షకులకు సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఇక ఉన్న షోలు సరిపోవు అన్నట్లు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కొత్త షో కూడా మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ లో భాగంగా ప్రతి వారం కూడా వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంటర్టైన్మెంట్ పంచడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఎంతోమంది టాలెంట్ ఉన్నవారికి ఛాన్సులు ఇస్తూ ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ సెలబ్రిటీలను చేస్తూ ఉంది అని చెప్పాలి. కాగా జబర్దస్త్ సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలకు కూడా అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. అయితేజబర్దస్త్ టీం లీడర్ అయిన పంచు ప్రసాద్ అటు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పుడు తన ఆటో పంచులతో ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటాడు.


 రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి అనారోగ్య సమస్యలతో బాధపడే పంచ్ ప్రసాద్ ఏకంగా తనపైన తానే పంచులు వేసుకొని నవ్వించడం ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఎప్పుడు బాధలను చెప్పుకొని ఎమోషనల్ కాలేదు. కానీ మొదటిసారి ఇటీవల  విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో భాగంగా తన ఫ్యామిలీ మెంబర్స్ ని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు పంచ్ ప్రసాద్. ఫ్యామిలీ ఫోటో తెరపై చూపించగా ఫోటోలో పంచ్ ప్రసాద్ నాన్న, అన్న, అక్క, తల్లి అందరూ ఉంటారు. అయితే ఇప్పుడు మా అమ్మ నేనే ఉన్నాము. నాన్న, అన్న, అక్క ముగ్గురు చనిపోయారు. కేవలం ఈ ఒక్క ఫోటో మాత్రమే మిగిలింది అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ఫాన్స్ సైతం బాగోద్వేగానికి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: