ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకునే షోలలో ఒకటిగా కొనసాగుతుంది అని చెప్పాలి  అయితే ఒకప్పుడు కేవలం అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ లు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం ఒక వైపు డాన్స్ తో పాటుమరోవైపు కామెడీ షోల తరహాలో ఎంటర్టైన్మెంట్ కూడా అందుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఢీ షో ఎన్ని సీజన్లు పుట్టుకొస్తున్న ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం తగ్గడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇకపోతే ప్రతి వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా హైపర్ ఆది సహా మరి కొంతమంది టీం లీడర్లు అదిరిపోయే స్కిట్లు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే వచ్చేవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కాస్త విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది ఢీ షో గురించి అసలు నిజాలు బయట పెట్టేశాడు అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం ఢీ షోలో టీం లీడర్ గా కొనసాగుతున్న హైపర్ ఆది, జెస్సి ఇద్దరు కూడా స్కిట్లో భాగంగా చాప దుప్పటి తెచ్చుకొని ఢీ స్టేజ్ మీద పరుచుకుని పడుకుంటారు. ఇంతలో ఆది పక్కింట్లో ఉండే అమ్మాయి ఇంట్లో స్పేస్ లేక స్టేజి మీద పడుకోవడానికి వస్తుంది. రండి రండి మాకు కూడా అదే కావాలి అని హైపర్ ఆది అనేసరికి.. నేను మీకు కిలోమీటర్ దూరంలో పడుకుంటాను అంటూ అమ్మాయి చెబుతుంది. నాకు నిద్రలో కిలోమీటర్ పాకే అలవాటు ఉంది అని ఆది పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు  ఇంతలో జెస్సి నిద్ర రావట్లేదు ఏదైనా కథ చెప్పు అన్న అని హైపర్ ఆదిని అడుగుతాడు. దీంతో అనగనగా ఢీ 15 అనే సీజన్ 6 నెలలట.. అయితే అందులో కొత్త టీం లీడర్లు అంట.. వాళ్ళు రిజిస్టర్ అవ్వడానికి 10 నెలలు పడుతుందట  అని చెప్పేసరికి ఇక తన గురించే సెటైర్ వేస్తున్నాడు అని అర్థం చేసుకున్న జెస్సి వద్దన్నా చాలు అని చెప్పి నిద్రపోతాడు. ఇక హైపర్ ఆది చెప్పిన కథతో కొత్తగా ఎవరైనా వస్తే రిజిస్టర్ కావడానికి నిజంగా అంత సమయం పడుతుందా అనే చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: