సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ లకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ముఖ్యంగా వీరి వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక రకాల వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆ టాపిక్ గా మారుతూ ఉంటాయి. అయితే గత కొన్ని ఏళ్ళుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇక దీనికి గాను నరేష్ భార్య వీరిద్దరిపై అప్పట్లో కేసు కూడా పెట్టిన వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు కొత్త ఏడాదికి సుస్వాగతం పలుకుతూ తమ బంధానికి సంబంధించిన ఒక వార్తని వారి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు నరేష్ మరియు పవిత్ర లోకేష్. 

తమ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ కొత్త సంవత్సరం కొత్తగా ప్రారంభించాలి దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ తమ రిలేషన్షిప్ గురించి చెప్పుకొచ్చారు వీరిద్దరూ. దీంతోపాటు త్వరలోనే మేమిద్దరం వివాహం చేసుకుంటున్నాం అంటూ.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ.. దీనికి మీ ఆశీస్సులు కావాలి అంటూ.. ఆ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు నరేష్ మరియు పవిత్ర. దీంతో ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ వీరిద్దరూ అనుకున్నంత పని చేశారు అంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ వీడియో చూసిన అనంతరం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ వీడియో లో వీరిద్దరూ ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ. లిప్ లాక్ చేసుకోవడం  దాని అనంతరం వీరిద్దరూ గట్టిగా కౌగిలించుకోవడం.. ఇప్పుడూ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అయితే నరేష్ కు పవిత్ర తో వివాహం జరిగితే ఇది ఆయనకి నాలుగవ వివాహం.. ఇక పవిత్ర లోకేష్ కి ఇది రెండవ వివాహం.. అయితే ఇన్నేళ్ల సహజీవనం తర్వాత ఎట్టకేలకు కొత్త సంవత్సరంలో వీరిద్దరి రిలేషన్షిప్ పై క్లారిటీ ఇవ్వడంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: