బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కియరా అద్వాని తన ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్న ఈ అమ్మడు త్వరలో అతనితో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, కియరా అద్వానిలు ఇద్దరు త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నారని తెలుస్తుంది.

బాలీవుడ్ లో ఏ ఫంక్షన్ చూసినా సరే వారిద్దరు ఒకచోట ప్రత్యక్షమవుతున్నారు. అయితే కియరా పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 6న సిద్ధార్థ్ తో కియరా అద్వాని మూడు ముళ్లు వేసుకోబోతుందని తెలుస్తుంది. సిద్ధార్థ్, కియరాల పెళ్లి రాజస్థాన్ లోని ప్యాలెస్ లో జరగబోతుందని అంటున్నారు. అయితే ఈ పెళ్లిపై కియరా అద్వాని ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. అదెల అంటే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న కియరా ఇంత ఎర్లీ గా పెళ్లి చేసుకోవడాన్ని ఆమె ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

నిజంగానే కెరీర్ ఫాం లో లేకపోతే.. ఒకవేళ సినిమా ఛాన్స్ లు రాకపోతే పెళ్లి చేసుకున్నా ఓకే కానీ బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా కియరా అదరగొడుతుంది. అలాంటి టైం లో కియరా అద్వాని ఇలా పెళ్లికి రెడీ అవడంపై ఆమె ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసే ఆలోచనతోనే ఇంత త్వరగా కియరా పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. మొత్తానికి కియరా పెళ్లిపై ఆమె ఫ్యాన్స్ విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 6న సిద్ధార్థ్, కియరాల పెళ్లి జరగబోతుంది. ఈలోగా తను కమిటైన సినిమాలు పూర్తి చేసి పెళ్లి తర్వాత ఒక 3 నెలలు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటుందట కియరా అద్వాని ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలతో పాటుగా చరణ్ 15వ సినిమాలో కూడా నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: