సాధారణంగా ఏ భార్యాభర్తల మధ్య అయినా గొడవలు, తగాదాలు ఉంటూ ఉంటాయి. చాలామంది ఈ చిన్న చిన్న విషయాలకి గాను విడాకుల దాకా వెళతారు. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని చాలామంది స్టార్ సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు. ఇక ఆ లిస్టులోకి వచ్చిన నాగచైతన్య సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ గోవాలో అంగరంగ వైభవంగా పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకే ఎవరూ ఊహించిన విధంగా విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. 

అయితే వారిద్దరి మధ్య ఇప్పటికీ ప్రేమ ఉందని వారి అభిమానులు నమ్ముతున్నారు. అయితే దానికి ముఖ్య కారణం తాజాగా ఎయిర్పోర్టులో సమంత పిక్స్ చూసిన నాగచైతన్య చేసిన కొన్ని కామెంట్లు అని తెలుస్తోంది.అయితే సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దీనికిగాను తాజాగా దక్షిణ కొరియాలో ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ను కూడా తీసుకుంది సమంత. అయితే తాజాగా సమంత ముఖ్య పాత్రలో నటిస్తున్న షాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొన్న సమంత ఈ క్రమంలోనే ఆమె ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది.

ఇక ఈ సందర్భంగా ఆమెను చూసిన చాలా మంది తన అభిమానులు సమంత ఏంటి ఇలా అయిపోయింది అంటూ బాధపడుతున్నారు. సమంత ఇంతకుముందులాగా కాకుండా చాలా బక్కబడిపోయింది ముఖం లాగేసి చాలా దారుణంగా ఉంది అంటూ ఈ ఫోటోలు చూసిన చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత తాజా ఫోటోలను చూసిన నాగచైతన్య ఆమె ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సమంత అనారోగ్యం కారణంగా సమంతని పర్సనల్గా మీట్ అవ్వాలని నాగచైతన్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తలుగా దూరమైనప్పటికీ ఒక ఫ్రెండ్ లాగా తన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని నాగచైతన్య ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: