సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ కూతురుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది శృతిహాసన్. అనంతరం తన అందం తన నటనతో స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. అయితే ఈ సంక్రాంతికి ఒకేసారి రెండు సినిమాలు తో సందడి చేయనుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె హీరోయిన్గా నటించిన వీర సింహారెడ్డి ఇవాళ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా హీరోయిన్గా నటించింది. ఇక రేపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో అలరించనుంది ఈమె .

భారీ  అంచనాల నడుమ ఈ సినిమా రేపు విడుదల కానుంది. అయితే తాజాగా శృతిహాసన్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే శృతిహాసన్ తాజాగా తన ఖాతాలో ఈ జనరేషన్లో ఎవరికి సాధ్యం కానీ ఒక అవార్డును తెచ్చుకుంది.ఇద్దరు సీనియర్ మరియు బడా స్టార్ హీరోలతోనే కాకుండా వారి కొడుకులతో కూడా నటించిన హీరోయిన్ గా అరుదైన ఘనతను దక్కించుకుంది. అయితే తాజాగా చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించిన ఈమె ఆయన కొడుకు రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

చిరంజీవి మరియు ఆయన కొడుకుతోనే కాకుండా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమాలో నటించింది ఈమె. దాని అనంతరం మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ తో కూడా నటించింది శృతిహాసన్. మరోవైపు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆయనకి జోడిగా నటించిన ఈమె కొడుకు ఎన్టీఆర్ సరసన రామయ్య వస్తావయ్య సినిమాలో కూడా నటించింది. అయితే మొత్తానికి ఏ హీరోయిన్ నటించినట్లుగా తండ్రి కొడుకుల సరసన హీరోయిన్గా నటించిన ఏకైక హీరోయిన్గా ఒక రికార్డు క్రియేట్ చేసింది శృతిహాసన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: