ఇక పంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి టేకింగ్‏కు భారతీయులే కాదు.. విదేశీయులు ఇంకా అలాగే హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఫుల్ గా ఫిదా అయ్యారు.మెగా పవర్ రామ్ చరణ్ ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల యాక్టింగ్ కి  ప్రపంచం ప్రశంసల వర్షం కురిపించింది. ఇక ఇటీవల విశ్వవేదికపై ఆర్.ఆర్.ఆర్ మరోసారి తన సత్తా చాటింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో మన నాటు నాటు సాంగ్ అవార్డ్ ని సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ స్టేజిపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నారు.  ఇంకా ఈ అవార్డ్ ప్రదానోత్సవ వేడుకలలో హాలీవుడ్ స్టార్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‏ను ఆర్.ఆర్.ఆర్ చిత్రబృందం కలుసుకుంది. దీంతో తన ఫ్యాన్ బాయ్ ముచ్చటను తీర్చుకున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి.హాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్స్ లో ఒక్కడైన స్టీవెన్ స్పీల్ బర్గ్ (76)తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ నా దేవుడిని కలిశాను అంటూ పోస్ట్ షేర్ చేశాడు జక్కన్న.
ఆయన షేర్ చేసిన ఫోటోలో రాజమౌళి ఎక్స్ ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ బాగా సంతోషంగా ఫీలవుతున్నారు. ఈ ఫోటోలో రాజమౌళితో పాటు కీరవాణి కూడా ఉన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న నాటు నాటు సాంగ్ ని స్టీవెన్ స్పీల్ బర్గ్ లైక్ చేశారని ఆయన తెలిపారు.ఇంకా అలాగే ఇదే ఫోటోను ఏం ఏం కీరవాణి కూడా షేర్ చేస్తూ.. సినిమాల దేవుడిని కలుసుకునే ఛాన్స్ వచ్చింది. డ్యూయల్‏తో ఆయన సినిమాలను నేను ఎంతగా ఇష్టపడతానో ఆయనకు చెప్పాను అంటూ కీరవాణి పేర్కొన్నారు. ఇంకా అలాగే నాటు నాటు పాటను ఆయన ఇష్టపడడం తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు కూడా చెప్పారు కీరవాణి.

మరింత సమాచారం తెలుసుకోండి: