టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈమె హవా నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఈ సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించింది శృతిహాసన్. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య ఈ రెండు సినిమాల్లోనూ ఈ సీనియర్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది శృతిహాసన్. దీంతో శృతిహాసన్ కి ఈ సంక్రాంతి పండుగ బాగా కలిసి వచ్చింది అని అంటున్నారు. 

అయితే ఇందులో భాగంగానే చాలామంది ఈ రెండు సినిమాల్లో కూడా శృతిహాసన్ క్యారెక్టర్ సినిమాల్లో అంత పెద్దగా లేనప్పటికీ మంచి విజయాన్ని అందుకుంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి లో కనీసం ఒక పావుగంట కూడా కనిపించలేదు. కేవలం రెండు మూడు పాటలల్లో మాత్రమే శృతిహాసన్ కనిపించింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఆఫీసర్గా బాగానే ఆకట్టుకుంది.అయితే తాజాగా దీనిపై స్పందించింది శృతిహాసన్. ఈ రెండు సినిమాలకి గాను తనకు డిఫరెంట్ గా ప్రశంసలు అందుతున్నాయి అంటూ చెప్పుకొచ్చింది ఈమె. ఇందులో భాగంగానే చాలామంది నేను బాలయ్య సినిమాలో చాలా ఎక్కువ సేపు కనిపిస్తాను అని భావించారు.

కానీ ఆ సినిమాలో నా పాత్ర చాలా చిన్నది అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. అంతేకాదు ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ తనకి చాలా నుండి తెలుసు అని.. ఈ సినిమా మొత్తం కూడా బాలయ్య గారిది అని.. బాలయ్య గారి చుట్టే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాతో బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటారు అని పేర్కొంది .అంతేకాదు చిరంజీవి అభిమానులకు కూడా వాల్తేరు వీరయ్య సినిమా బాగా నచ్చుతుంది అని ఈ సినిమాను చూసి మెగా అభిమానులు చాలా సంతోషిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు గత కొంతకాలంగా నేను పెద్ద సినిమాల్లో నటించలేదు. కాబట్టి ఈ సినిమాలో చిన్న పాత్రలే అయినప్పటికీ పెద్ద హీరోల సరసన నటించాలి అన్న ఉద్దేశంతో నటించాను అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: