పాన్ యూనివర్స్ స్టార్ అయిన ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను లైనప్ చేసి.. ఆయా సినిమాల షూటింగ్స్‌తో చాలా బిజీ బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ రాధేశ్యామ్ ఆశించిన స్థాయి లో అయితే ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇప్పుడు రెబల్ స్టార్ లేటెస్ట్ మూవీ సలార్ పైనే భారీ ఆశలను పెట్టుకున్నారటా.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.. ఇక ఈ సినిమా ను రెండు పార్ట్ లుగా తెరకెక్కించాడటా ప్రశాంత్. ఇక ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో  కూడా చేస్తున్నాడు. సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా లో ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా  కూడా ఎంతో ఆసక్తి గా అయితే ఎదురుచూస్తున్నారు.

మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్ల తో ఎదురుచూస్తున్నారటా అభిమానులు.ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయిక గా నటిస్తుండగా.. హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజా గా ఈ సినిమా కు సంబంధించిన ఓ వార్త  ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

సలార్ షూటింగ్ ఇప్పటికే 90 శతం పూర్తయ్యిందని. అలాగే ఈ మూవీ మరో 250 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.. ఈమేరకు మేకర్స్ ఒక పోస్ట్ ను చేశారు. #SalaarEuphoriaIn250Days అనే ట్యాగ్ ను కూడా వారు జోడించారు. దాంతో ఈ మరో 250 రోజుల్లో రానుందని వారు చెప్పేశారు. దాంతో డార్
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఆనందంగా వున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: