తెలుగు అగ్రహీరోలలో నోటి దురుసు ఎక్కువగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నందమూరి బాలకృష్ణ అని చెప్పాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఇది వరకు ఎన్నోసార్లు ఆయన వివాదాల్లో చిక్కుకున్నాడు..

అయితే ఈమధ్య కాలంలో ఆహా మీడియా లో ప్రసారమయ్యే 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షో ద్వారా జనాల్లో బాలయ్య మీద ఉన్న ఆ చెడు అభిప్రాయాన్ని తొలగించేలా అయితే చేసాడు.. బాలయ్య బాబు మనస్తత్వం చిన్న పిల్లాడి మనస్తత్వం అని అందరికీ ఈ టాక్ షో ద్వారా అర్థమైంది.

కానీ అదంతా షో కోసం చేస్తున్న నాటకమేనా.. బాలయ్య ఒరిజినల్ ఇంకా అలానే ఉందా అంటే అవుననే చెప్తున్నారు... నిన్న హైదరాబాద్ లో 'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుక అంగరంగ వైభవంగా  జరిగింది..ఈ వేడుకకి మూవీ టీం మొత్తం మరియు ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ టాప్ డైరెక్టర్స్ మరియు కుర్ర హీరోలు కూడా హాజరయ్యారు.

సినిమా ఈవెంట్ లో బాలయ్య తన ప్రసంగంలో నోరు జారీ ఎక్కువగానే మాట్లాడాడు.. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీని ఆయన అవమానించాడు.. ఒక ఆర్టిస్టు తో స్టేజి మీద మాట్లాడుతూ 'మనం కబుర్లు బ్రేక్ టైంలో చాలానే చెప్పుకునేవాళ్ళం.. నాన్నగారి గురించి ఈ అక్కినేని తొక్కినేని గురించి ఇలా ఎన్నో మాట్లాడుకున్నాం' అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు  సోషల్ మీడియా లో బాగా సెన్సేషనల్ గా మారింది.

ఇండస్ట్రీలో లెజండరీ స్థానంలో ఉన్న అక్కినేని కుటుంబం గురించి వేలాది మంది అభిమానులు సమక్షంలో అలా మాట్లాడడం ఎంత వరకు సబబు అంటూ నెటిజెన్స్ బాలయ్యపై మండి పడుతున్నారు.. అంతే కాదు అక్కడికి అతిథులుగా వచ్చిన కుర్ర హీరోలు విశ్వక్ సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డని ఉద్దేశిస్తూ హిందీలో బూతులు కూడా మాట్లాడడం వంటివి కూడా చూస్తూ ఉంటే పాత బాలయ్య మళ్ళీ బ్యాక్ అయ్యాడు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: