తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటువంటి కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం బింబిసారా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాకు మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించగా , కేథరిన్ , సంయుక్త మీనన్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు . మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇది ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే బుల్లితెరపై ప్రసారం చేశారు. ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే జీ సంస్థ వారు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయగా , ఈ మూవీ కి మొట్ట మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 11.46 "టి ఆర్ పి" లభించింది. ఓవరాల్ గా చూసుకుంటే బింబిసారా మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" లభించింది అని చెప్పవచ్చు.

ఇలా ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "ఎమిగోస్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకోని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: