టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మూవీల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు చైతూ. అయితే ఇటీవలే థ్యాంక్యూ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతూ ఆ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు.విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాలా దారుణంగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం చైతూ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. దూత అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ కు కూడా విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా అలాగే తెలుగు తమిళ భాషల్లో కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ స్టార్ డైరెక్టర్ విక్రమ్ ప్రభు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య మరో సినిమాకి కూడా కమిట్ అయ్యాడని తెలుస్తోంది. తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడితోనే ఈ యంగ్ హీరో మరోసారి కలిసి పని చేయనున్నాడని సమాచారం తెలుస్తోంది.


ఇంతకు ఆ దర్శకుడు ఎవరో కాదు.టాలీవుడ్ లో సెన్సిబుల్ మూవీస్ హిట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమ కథలు తెరకెక్కించడంతో శేఖర్ కమ్ములది చాలా డిఫరెంట్ స్టైల్. మన నేటివిటీకి దగ్గర ఉండే కథలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు ఈ టాలెంటెడ్ సీనియర్ డైరెక్టర్.గతంలో అక్కినేని నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ అనే సినిమాని తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. ఈ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ మూవీలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడిగా నటించి ఎంతగానో ఆకట్టుకున్నాడు. నాగచైతన్య నటనతో పాటు డాన్స్ లతో కూడా చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి చేయబోతున్నాడని సమాచారం తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత వున్నదో ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: