విశాల్ గత సంవత్సరం తమిళంలో నటించిన సూపర్ హిట్ మూవీ "ఇరుంబు తిరై". పి.ఎస్ మిత్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మించిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సస్ ను సాధించింది. ఇదే సినిమాని తెలుగులో "అభిమన్యుడు" పేరుతో డబ్బింగ్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా కమర్షియల్ గా సక్సస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన సమంత అక్కినేని నటించిగా, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. 


ఇప్పుడీ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ నిర్మించడానికి విశాల్ రెడీ అయిపోయాడు. అయితే మొదటి భాగానికి దర్శకత్వం వహించిన మిత్రన్ కి బదులు మరో కొత్త దర్శకుడిని విశాల్ ఎంచుకోవడం విశేషం. కానీ విలన్ గా మాత్రం మొదటి భాగంలో నటించిన యాక్షన్ కింగ్ అర్జున్ కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ సీక్వెల్ లో సమంత నటిస్తుందా లేదా..? అని ఇంకా కన్ ఫర్మ్ అవలేదట. కాకపోతే ఆల్రెడీ విశాల్ సమంత తో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడట. ఇంకా సమంత ఏ విషయం చెప్పలేదని సమాచారం.


విశాల్ ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలో తమన్నా హీరోయిన్‌గా ఓ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత మిస్కిన్ తో "డిటెక్టివ్ 2"  స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ సినిమా కన్నా ముందే "అభిమన్యుడు 2" పూర్తి చేస్తారట. ఇక తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ "టెంపర్".. రీమేక్ రిలీజై హిట్ టాక్ ని తెచ్చుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: