బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నారు.  రూ.200 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తీస్తున్నారు.  అత్యద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జూవెలర్ తీఫ్ గా నటిస్తున్నట్లు సమాచారం.   ఇప్పటి వరకు దుబాయ్, ముంబాయిలో, కేరళా, హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది. 

ఈ సినిమా దాదాపు పూర్తయ్యిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఇటీవల శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.   ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టేలా ఉండడంతో ఈ సినిమా అనుకున్న తేదికి విడుదల చేయడం కుదరకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సాహూ సినిమా ఆగస్టు లో కాదు అక్టోబర్ లో రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్ లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాహుబలి సిరీస్ కోసం ప్రభాస్ ఐదు సంవత్సరాలు తన తదుపరి సినిమా కోసం రెండేళ్లు పూర్తి చేశాడు. ఆయన మరో సినిమా ఎప్పుడొస్తుందో అని అభినులు బాధపడుతున్నారు. అయితే సాహూ సినిమా పై వస్తున్నా వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులుఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: