సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్.  అందులో నో డౌట్.. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది.  పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా రంగస్థలం, అభిమన్యుడు సినిమాలు చేసి మెప్పించింది.  సోలోగా సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నది.  భర్త నాగచైతన్యతో కలిసి చేసిన మజిలీ సినిమా సూపర్ హిట్టైంది.  


టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత.  ప్రస్తుతం ఓ బేబీ సినిమా చేస్తోంది.  కొరియన్ సినిమా మిస్ గ్రానీ కి ఇది రీమేక్.  జులై 5 న రిలీజ్ కాబోతున్నది.  సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.  


సురేష్ బాబు బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్ కంపెనీతో కల్సి ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.  ఇందులో సమంత చేసిన పాత్రకోసం శ్రద్దా కపూర్ ను ఎంపిక చేయాలని అనుకుంటున్నారు.  శ్రద్దా కపూర్ అయితే సినిమాకు న్యాయం చేస్తుందని, అందుకే ఆమెను ఎంపిక చేయాలని అనుకుంటున్నారట.  


సదరు ప్రొడక్షన్ కంపెనీతో మాట్లాడేందుకు రానా ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది.  అనుకున్నట్టుగా అన్ని పనులు పూర్తయితే... బాలీవుడ్ లోకి ఓ బేబీ రీమేక్ అవుతుంది.  ఇక్కడ విషయం ఏమిటంటే.. సమంతనే బాలీవుడ్ రీమేక్ లో నటించే అవకాశం ఇవొచ్చు కదా.  అక్కడ కూడా ఎంట్రీ ఇస్తుంది.  ఎందుకని సురేష్ బాబు అలా ఆలోచించడం లేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: