ఒక కుటుంబంలో నుంచి సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి సక్సెస్ అయ్యాక ఆ కుటుంబం నుంచి కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు. అది సహజం.  వచ్చిన తరువాత హిట్ అవుతారా లేదా అన్నది వాళ్ళ చేతుల్లో ఉంటుంది.  ఎంట్రీ కావడానికైనా ఆ పరపతి ఉపయోగపడుతుంది.  


టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యాడు.  పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ అయ్యాడు. గీత గోవిందం సినిమా హీరోగా నిలబెట్టింది.  


విజయ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడంతో అతని తమ్ముడు ఆనంద్ ను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు.  దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. హీరో తమ్ముడు సినిమా కావడంతో తప్పకుండా ప్రమోషన్ ఉంటుంది.  విజయ్ ప్రమోషన్ చేస్తే సినిమాకు ప్లస్ అవుతుంది.  


కానీ విజయ్ తమ్ముడిని పెద్దగా పట్టించుకోవడం లేదు.  సినిమా ఓపెనింగ్ సమయంలో దొరసాని గురించి మాట్లాడాడు గాని తరువాత ఎలాంటి స్పందన లేదు.  సినిమాపై విజయ్ తన స్నేహితుడు పోలిశెట్టిని ప్రమోట్ చేస్తూ.. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమా ట్రైలర్ ను ట్విట్టర్ ద్వారా ప్రోమోట్ చేస్తున్నాడు.  దొరసాని విషయంలో మాత్రం ఈ హీరో సైలెంట్ గా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: