టాలీవుడ్ లో పోలీస్ స్టొరీలు ఎన్నో వచ్చాయి.  ఒకప్పుడు అంకుశం సినిమాతో డాక్టర్ రాజశేఖర్ పోలీస్ పవర్ ఏంటో చూపిస్తే..‘పోలీస్ స్టోరీ’సినిమాతో సాయికుమార్ మరో ట్రెండ్ సృష్టించారు. పోలీస్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అయిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఇదే ఫార్ములాతో వస్తున్నాడు జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్. జబర్ధస్త్ మంచి స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన షకలక శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి పరమ భక్తుడని అంటారు. వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన ఈ మద్య హీరో అవతారం ఎత్తారు. 

తాజాగా ఆర్.ఏ.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జానీ నిర్మిస్తున్న మూవీ ‘నాలుగో సింహం’.  సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా షకలక శంకర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. షకలక శంకర్ సరసన ముంబై ముద్దుగుమ్మ అక్షయ్ శెట్టి నటిస్తోంది. 

ఈ మూవీలో ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల నేపథ్యంలో ఓ పోలీస్ అధికారి ఎలా దుర్మార్గుల అంతు చూశాడు అన్న కథాంశంతో సాగుతుందట. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.  ఈ మూవీలో  ‘ముద్దమందారం’ పూర్ణిమ, ఆర్.కె, సత్య ప్రకాష్, గుర్లిన్ చోప్రా, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  సినిమాటోగ్రఫీ: శ్రవణ్ కుమార్, ఫైట్స్: దేవరాజ్, ఎడిటింగ్: శ్రీ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాణం-దర్శకత్వం: జానీ


షకలక శంకర్ మాట్లాడుతూ.. “ఇంతకుముందు ఎందరో హీరోలు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ గా మెప్పించారు. వారందరి ప్రేరణతో నేను కూడా ‘నాలుగో సింహం’ గా అలరించేందుకు ప్రయత్నిస్తున్నాను. దర్శకనిర్మాత జానీ చాలా జాగ్రత్తగా సినిమాను తీస్తున్నారు. 

దర్శకనిర్మాత జానీ మాట్లాడుతూ.. ‘నాలుగో సింహం’ సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తున్నామన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అమానుషాలు.. వాటిని చూసీ చూడనట్లుగా ఉండే అవినీతి అధికారుల నిర్వాకాలపై నిప్పులు చెరుగుతూ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిందని, ఈ మూవీ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: