రెండు బ్రెయిన్‌లతో పుట్టిన ఓ యువకుడి కథ ఇది. కన్‌ఫ్యూజన్ లేకుండా అర్థవంతంగా దర్శకుడు రత్నబాబు ఈ సినిమాను తెరకెక్కించారు అని అన్నారు ఆది సాయికుమార్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం బుర్రకథ. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

 

శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిస్తీ చక్రవర్తి, నైరాషా కథానాయికలు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదలకానుంది. హీరో వెంకటేష్ చిత్ర ట్రైలర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆదిసాయికుమార్ మాట్లాడుతూ నాకు మంచి సక్సెస్ వచ్చి చాలా రోజులుంది.

 

ఈ సినిమా బ్రేక్‌నిస్తుందనే నమ్మకం ఉంది. కుటుంబ విలువలతో సరదాగా సాగుతుంది. ప్రతి ఒక్కరం ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది అని తెలిపారు. ప్రతిభను ప్రోత్సహించే వాళ్లు ఇండస్ట్రీలో తక్కువ మంది ఉన్నారు. హీరో ఆదితో పాటు నిర్మాతలు నన్ను, నా కథను నమ్మి ఈ సినిమా చేశారు. ప్రీైక్లెమాక్స్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి.

 

హిట్టు సినిమా చేశామనే నమ్మకంతో ఉన్నాం. అభి, రామ్ పాత్రలు భిన్న పార్శాలతో సాగుతూ నవ్విస్తాయి అని డైమండ్ రత్నబాబు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పృథ్వీ, మిస్తీ చక్రవర్తి, గాయత్రి గుప్తా, సాయికార్తిక్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: