ఇండస్ట్రీలో వయస్సు మీద పడే కొద్ది అందం అవకాశాలు తగ్గుతుంటాయి.కాని నయనతార మాత్రం దానికి భిన్నంగా వయస్సు పెరిగే కొద్దీ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో అవకాశాలను దక్కించుకుంటూ  యువ హీరోయిన్లకు పోటీగా మారుతుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి లో నటిస్తుంది.అలాగే మరోసారి మెగా వారితో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది.


1500 వందల కోట్లతో తెలుగు,తమిళ,హిందీ భాషలలో రామాయణం ను రూపాందించనున్నారు.ఇందులో సీత పాత్రకు నయనతార ను సంప్రదించినట్లు.దానికి ఆమె సుముఖత వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ముగ్గురు నిర్మాతలు వారిలో అల్లు అరవింద్ గారు ఒకరు.


ఈ చిత్రంతో బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో నటీనటులు,సాంకేతిక నిపుణలు వివరాలు తెలియాల్సి ఉంది.ఇప్పటి వరకు తెర మీదకు ఎక్కువ సార్లు వచ్చిన కథగా రామాయణం కు రికార్డ్ ఉంది.వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులను మెప్పిస్తుంది.మరోసారి అలా మెప్పిస్తుందో లేదో చూడడానికి కొద్ది కాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: