సినీ పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అదృష్టం కూడా ఉండాలి. అందుకే గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. అలా అందం,అభినయంతో పాటుఅదృష్టంతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె చేతిలో ప్రస్తుతం పదకొండు సినిమాలు ఉన్నాయి.  తమిళంతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది.

 

తమిళంలో ఈమె నటించిన "కణా" చిత్రం భారీ విజయం సాధించింది. ఇందులో ఈమె ఒక క్రికెటర్ గా కనిపించింది. ఈ సినిమాని తెలుగులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా  భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో "కౌసల్య క్రిష్ణమూర్తి "పేరుతో రీమేక్ చేసారు. టీజర్ విడుదలయి మంచి స్పందనని తెచ్చుకుంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఇదేగాక తమిళంలో మరీ నాలుగు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఇంకా మరో నాలుగు సినిమాలను రీసెంట్ గా అనౌన్స్ చేసింది. తెలుగులో ఇప్పుడు విడుదలవుతున్న "కౌసల్య క్రిష్ణమూర్తి " చిత్రంతోపాటు, "మిస్ మ్యాచ్ " అనే మరో చిత్రంలో నటిస్తుంది. అలాగే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండతో ఒక చిత్రంలో నటిస్తుంది. అలాగే కమల్ హాసన్,శంకర్ కాంబినేషన్ లో వచ్చే క్రేజీ ప్రాజెక్టు "భారతీయుడు 2 " లో ఐశ్వర్య రాజేష్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

 

బుల్లితెర యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్2010 లో వచ్చిన  నీతన్ అవన్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.  2012 లో వచ్చిన "అత్తకత్తి" అనే సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.  ఇప్పటి వరకు ఇరవై ఐదు సినిమాల్లో నటించింది. తన ఇరవై ఐదవ సినిమా అయిన" కణా" సినిమాతో తిరుగులేని విజయం సాధించింది. ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఐశ్వర్య రాజేష్.


మరింత సమాచారం తెలుసుకోండి: