అల్లు అర్జున్ కొత్త సినిమా వేణు శ్రీరామ్, సుకుమార్ లతో త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి.  మొదట వేణు శ్రీరామ్ సినిమా మొదలౌతుంది.  ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్తే.. సుకుమార్ సినిమా నవంబర్ నుంచి స్టార్ట్ కాబోతున్నది.  అయితే, అల్లు అర్జున్.. సుకుమార్ కాంబినషన్లో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న సినిమాను కథను మొదట మహేష్ బాబు కోసం తయారు చేసుకున్నారు.  కానీ, సీరియస్ స్టోరీతో ఇప్పుడు సినిమా చేయలేనని మహెష్ చెప్పడంతో ఆ కథ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది.  


అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా కథను రెడీ చేసి వినిపించాడు.  స్టోరీ లైన్ నచ్చడంతో  స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో ఉన్నాడు సుకుమార్.  దాదాపుగా ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తోంది.   సో, మహేష్ బాబు తో చేయాల్సిన కథ అల్లు అర్జున్ వద్దకు రావడం, ఆ కథకు ఆయన ఒకే  చేయడం అన్ని పూర్తయ్యాయి. 


ఇదిలా ఉంటె, మహేష్ బాబు కూడా అదే విధమైన దూకుడును కొనసాగించేందుకు సిద్ధం అవుతున్నాడు.  మహర్షి సినిమా పూర్తైన వెంటనే, 26 వ సినిమా  సరిలేరు నీకెవ్వరూ మొదలు పెట్టారు.  ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది.  దీనిపై అంచనాలు ఉన్నాయి.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయిలో ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతోంది.  నవంబర్ వరకు షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  


నవంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.  సంక్రాంతికి వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.  నవంబర్ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే, మహేష్ బాబు..పరశురామ్  దర్శకత్వంలో సినిమా ఉంటుంది.  ఈ సినిమాను డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.  ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.  నవంబర్ లో మైత్రి నిర్మిస్తున్న బన్నీ సినిమా సెట్స్ మీదకు వెళ్తే.. డిసెంబర్ లో అదే మైత్రి మూవీ నిర్మించబోయే మహేష్ బాబు సినిమా కూడా సెట్స్ మీదకు  వెళ్లే అవకాశం ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: