అభిమాన సెలబ్రిటీ ని కలుసుకోవడానికి మహా అయితే ఏం చేస్తారు కొంతమంది అభిమానులు ఫిల్మ్ సెట్స్‌లో గంటల తరబడి నిలబడి వేచి చూస్తారు, కొంతమంది అభిమానులు వారి తారల పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలపడానికి గంటల తరబడి రాత్రిపూట ఇంటి దెగ్గర నిలబడతారు కానీ వీటన్నింటినీ  మించి ఓ కాజల్ అభిమాని  అంతకు మించి చేశాడు.

అతడి కాజల్ ని చాలా దగ్గర గా కలవడానికి అధిక మొత్తం లో డబ్బు లు పెట్టాలని నిర్ణయించుకున్నాడు పలు మీడియా కథనాల ప్రకారం రామనాథపురానికి  చెందిన ఒక యువకుడు కాజల్ ని కలవాలన్న ఆశతో అరవై లక్షల దాకా మోసగాళ్లకి ఇచ్చాడు.  సీతా సినీ ప్రమోషన్ అప్పుడూ ఆ నటితో  ముఖాముఖి సంభాషణ కోసం వాగ్దానం చేసిన ఒక వెబ్ సైట్ లో అతను చూసి కాజల్ తో ఎలాఅయినా సరే మాట్లాడదామని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఆ ముఠా వాళ్ళ తో మాట్లాడినప్పుడు మొదట యాభైవేల రూపాయ లు చెల్లించి తన వ్యక్తిగత వివరాల పంచుకోవాలని కోరారు. అతడు బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినా కారణాన అతనికి అది పెద్ద గా కనిపించలేదు వెంటనే చెల్లించి కాజల్ తో కలవడాని కి ప్రయత్నం చేశాడు. 

మూడు విడతలు గా ఆ ముఠా అతని దగ్గరనుంచీ దాదాపు గా అరవై లక్షల రూపాయల వరకు సొమ్ము కాజేశారు. తాను మోసపోతున్న  విషయం అర్ధం అయినప్పుడు ఆ అభిమాని ఇంకా ఆంతకన్నా ఎక్కువ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించాడు. అప్పుడు అతని  అశ్లీల ఫోటోలను  సోషల్ మీడియాలో లీక్ చేస్తామని ముఠా బెదిరించింది దానితో ఒత్తిడి కి గురైన  బాలుడు ఇంట్లో నుండి పారిపోయాడు. అతడు కోల్‌కతాలో దాక్కున్నట్లు గుర్తించిన పోలీసులు మొత్తం కథ తెలుసుకున్నారు. అభిమాని చేసిన ఫిర్యాదు ఆధారంగా శరవణకుమార్‌ అనే వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం .


మరింత సమాచారం తెలుసుకోండి: