టాలీవుడ్ టాప్ కమెడియన్ గా చెలామణి అవుతున్న అలీని తమన్నా కడిగేయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..అబ్బే కమెడియన్ అలీ కాదు.. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 3 లో వస్తున్న అలీని గత ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెల్లిన ట్రాన్స్ జెండర్ తమన్నా. గతంలో వచ్చిన బిగ్ బాస్ 1, 2 ల్లో మొదట్లో ఇంటి సభ్యుల మద్య ఎలాంటి వివాదాలు పెద్దగా రాలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ 3 లో మాత్రం ఎవరి గేమ్ వారు సేఫ్ గా ఆడుతున్నారు. ఈ విషయం గత ఆదివారం ఎలిమినేషన్ అయిన నటి హేమ చెప్పింది.
బిగ్ బాస్ 3 చూస్తున్న ప్రేక్షకులకు అందరూ చాలా కూల్ గా కనిపిస్తున్నారు, కానీ అక్కడ అందరూ తోపులే..ఎవరి గేమ్ వారు చాలా సేఫ్ గా ప్లే చేస్తున్నారని అన్నారు. నిన్న బిగ్ బాస్ లో ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. బజర్ మోగగానే అక్కడ ఓ డైమండ్ ఉంటుందని..అది ఎవరు దక్కించుకుంటారో వారు ఇంటి సభ్యులపై పెత్తనం చెలాయించవొచ్చని మరుసటి బజ్జర్ మోగా వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. ఈ టాస్క్ ప్రకారం వరుణ్ సందేష్ డైమండ్ అందుకున్నాడు.
అతడు కిరీటం తొడిగి తన మంత్రిగా బాబా భాస్కర్ ని ఎంచుకున్నారు. ఇక వరుణ్ సందేశ్ ఇంటి సభ్యులతో ఒక్క ఆట ఆడుకున్నాడు. తన బట్టలను ఉతకవలసిందిగా హిమజను బెడ్రూంను సరిగా సర్దమని శ్రీముఖి, మహేష్, తమన్నాలను నాగిని డ్యాన్స్ చేయాలని వారికి సహాయంగా బాబా భాస్కర్ ని ఉండమని చెప్పాడు. ఇలా సాగుతున్న క్రమంలో రెండో బజర్ మోగింది. వెంటనే ఇంటి సభ్యులు డైమండ్ దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. ఈ క్రమంలో అలీ డైమండ్ పట్టుకునే సమయంలో శివజ్యోతి (సావిత్రి) అడ్డపడగా ఆమెను నెట్టివేశాడు. తర్వాత సారీ చెప్పి ఆ డైమండ్ నీవే తీసుకో అని ఇచ్చాడు..కానీ శివజ్యోతి గేమ్ అన్న తర్వాత ఇటాంటివి సహజం అని చెప్పింది.
ఆ తర్వాత కిరీటం ధరించిన అలీ ఇంటి సభ్యుల్లో మగవారిని ఆడవారిగా మారాలని చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో జాఫర్, వరుణ్, వితికా, తమన్నాలు తమ వల్ల కాదని చెప్పారు. ఇదే సమయంలో తమన్నా, అలీపై పెద్దగా అరుస్తూ..బాడీ పెంచుకున్నంత మాత్రాన సూపర్ స్టార్ కాలేవని, నిన్ను సూపర్ స్టార్ కానివ్వనని చెప్పింది. ఇక సైలెంట్ గా ఉండే అన్షూరెడ్డిపై సీరియస్ అయ్యింది. అలీ పక్కన సిగ్గు, శరం లేకుండా ఎంత బాగా కూర్చున్నావంటూ తిట్టింది. ఆ విషయంలో ఇంటి సభ్యులు తమన్నాపై సీరియస్ అయ్యారు..కాస్త నోరు అదుపులో పెట్టుకోమని హితవు పలికారు.