బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ పూర్తయింది. అందరూ ఊహించినట్టుగానే తమన్నా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజిపై నుండి ఒక్కో హౌస్ మెంబర్ గురించి వివరిస్తూ వాళ్ళలోని లోపాలను తెలియజేసే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో తమన్నాకి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా బాబా భాస్కర్ గురించి చెబుతున్నప్పుడు ఆమె కంట తడి పెట్టడం అందరి మనసులను తాకింది. 


ఇకపోతే ఓ ముగ్గురికి మాత్రం తమన్నా చుక్కలు చూపించిందనే చెప్పాలి. రాహుల్, వితికా,ఆలీల ప్రవర్తన గురించి వివరిస్తూ చురకలంటించింది. మొదటగా రాహుల్ ని ఆడవాళ్ళకు గౌరవం ఇవ్వడం నేర్చుకోమని చెప్పింది. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళున్నారు. వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తావో ఇక్కడ కూడా అలాగే ఉండాలి అంది. ముఖ్యంగా  హౌస్ లో ఒక అమ్మాయినే టార్గెట్ చేసి, ఆ అమ్మాయి లేనపుడు ఆమె గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పింది. 


ఇక వితికా విషయానికొస్తే, డైలీ సీరియల్ లో కనిపించే కోడలి లాగా ఎప్పుడు గొడవపెట్టుకుందామా అని కారాలు మిరియాలు నూరుతూ ఉంటుందని, స్వతాహాగా వితికా మంచి పర్సన్ అని, రాహుల్ వల్ల ఆమె అలా అవుతుందంటూ కామెంట్ చేసింది. ఆలీని ఉద్దేశిస్తూ హౌస్ లో విలన్ అవుతున్నాడని, ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని, ఆడవాళ్ళ మీద అరవటం కంటే మగవాళ్ళ మీద అరిచి తన బలాన్ని చూపించుకోవాలని చెప్పింది.


చివరగా రవిక్రిష్ణ మరియు వరుణ్ ల గురించి చెప్తూ బయట హీరోలైన మీరు బిగ్ బాస్ హౌస్ లో  కూడా హీరోలని ప్రూవ్ చేసుకోవాలి అంది. బిగ్ బాస్  కి వచ్చింది తిని పడుకోవడానికి కాదని, ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ కి రావడమే వేస్ట్ అంటూ రోహిణికి చురకలు అంటించింది. మొత్తానికి ఎలిమినేట్ అయిన తర్వాత  హౌస్ మెంబర్స్ గురించి విశ్లేషణ చేసి ప్రేక్షకులని ఆకట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: