టాలీవుడ్ లో అతి వేగంగా సినిమాలు తీసే దర్శకులలో పూరి జగన్నాథ్ ముందుంటాడు. ఎంత పెద్ద స్టార్ తో అయినా ప్లాన్ ప్రకారం సినిమా తీయగలడు. మహేష్ బాబు లాంటి స్టార్ తో బిజినెస్ మేన్ సినిమాని అరవై రోజుల్లో తెరకెక్కించాడంటే పూరి వేగం అర్థం చేసుకోవచ్చు. వర్మ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన పూరి జగన్నాథ్ వర్మ లక్షణాలు చాలానే పుణికిపుచ్చుకున్నాడు. 


నెలరోజులలో స్క్రిప్ట్ సిద్ధం చేయగల మేధావి. జయాపజయాలను అటుంచితే ఆయన జెట్ వేగంతో సినిమాలు చేసి చిత్ర పరిశ్రమకు మేలు చేస్తుంటారు.ఇక ఆయన రామ్ హీరోగా తెరక్కెక్కించిన ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం అందుకుంది. ఆ మూవీ సక్సెస్ మూడ్ లో ఉండగానే మరో చిత్రం ప్రకటించేశారు పూరి. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తో చిత్రం చేస్తున్నట్లు నిన్న అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగిపోయింది.


సాఫ్ట్ హీరోలనే తెరపై రఫ్ ఆటిట్యూడ్ తో ప్రెసెంట్ చేసే పూరి ఇక రౌడీ హీరోని తెరపై ఎలా చూపిస్తారో ఆలోచిస్తేనే మతిపోతుంది .దీంతో ప్రేక్షకుల్లో ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరిగిపోయాయి. పూరి చేతిలో పడ్డ హీరోలు ఏ రేంజ్ లో ఎదిగిపోయారో చూసాం. మాస్ మసాలా సినిమాలు తీయడంలో కింగ్ అయిన పూరి విజయ్ ని ఏ విధంగా చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇస్మార్ట్  తర్వాత పూరి తన సినిమాను ప్రకటించాడు. మరి రామ్ పరిస్థితి ఏంటనే టాపిక్ మొదలైంది.


రామ్  ఇంకా తన కొత్త చిత్రానికి సంబందించిన ఎటువంటి స్టెప్ తీసుకోలేదని తెలుస్తుంది. గతంలో రామ్ కి నేను శైలజ వంటి క్లాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల ఓ కథ వినిపించగా, రామ్ పెదవి విరిచారని సమాచారం. అలాగే ఇస్మార్ట్ శంకర్ చిత్రం వంటి ఊర మాస్ మూవీ తరువాత ఎటువంటి సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో పాటు, ఈ విజయం తరువాత నుండైనా సినిమాల ఎంపికలో జాగ్త్రతగా ఉండాలని భావిస్తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: