సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఆయన కెరీర్ 26వ సినిమాగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఇప్పటికే సక్సెస్ఫుల్ గా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ నిన్నటితో పూర్తి అయిందని, ఇది తనకు మొదటి షెడ్యూల్ అని, షూటింగ్ మొత్తం ఎంతో హ్యాపీగా ఎంజాయ్మెంట్ తో గడిచిందని హీరోయిన్ రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, 

తొలిసారి ఆర్మీ మజార్ గా నటిస్తున్న ఈ సినిమా ఇంట్రో టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందనను రాబట్టింది. ఇక నేడు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సరిలేరు నీకెవ్వరు టీమ్, మన ఇండియన్ ఆర్మీ కి ట్రిబ్యూట్ గా ఒక చిన్న వీడియో టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సైనికుడి గొప్పతనం, అలానే దేశానికి అతడు అందించే సేవల గురించి తెలిపే ఈ అద్భుతమైన వీడియో టీజర్, ఇప్పటికే యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోతోంది. 

ఇకపోతే టీజర్ చివర్లో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గెటప్ లో గన్స్ పట్టుకుని ఉన్న సీన్స్ కు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతూ, టీజర్ పై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా తన బ్యానర్స్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉన్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు..... !! 


మరింత సమాచారం తెలుసుకోండి: