డియర్ కామ్రేడ్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డియర్ కామ్రేడ్ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చినప్పటికీ సినిమా బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా మొదలు కాబోతుంది. 
 
విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కథ గురించి ఇప్పటికే చాలా గాసిప్స్ వినిపించాయి. విజయ్ దేవరకొండ జై లవ కుశ సినిమాలో జై పాత్రలా నత్తితో నటిస్తాడని నత్తితోనే కామెడీ పండిస్తాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత పూరీ జగన్నాథ్ మహేశ్ బాబు కోసం తయారు చేసిన జనగణమన కథలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం విజయ్ ఈ రెండు కథల్లో నటించట్లేదని మరో కథలో నటించబోతున్నాడని తెలుస్తుంది. 
 
విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాకు పూరీ ఫైటర్ అనే టైటిల్ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేసాడని తెలుస్తోంది. ఈ సినిమా కథ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. నిజానికి ఈ కథను పూరీ జగన్నాథ్ ఎన్టీయార్ కోసం తయారు చేసాడని సమాచారం. టెంపర్ సినిమా హిట్ అయిన తరువాత పూరీ జగన్నాథ్ ఎన్టీయార్ కు ఈ కథ వినిపించాడట. కానీ ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో ఈ సినిమా మొదలుకాలేదని సమాచారం. 
 
ఇదే కథను కొన్ని మార్పులు చేర్పులు చేసి పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండకు వినిపించగా విజయ్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. 2020 జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడని సమాచారం అందుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: