'మిస్టర్ మజ్ను' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. కాగా తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ఫిక్స్ అయింది. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం దాదాపు సంవత్సరం నుండి అఖిల్ బాబు హీరోయిన్లును చూస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఆ మధ్య కియరా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదని తేలిపోయింది. ఆ తరువాత 'గ్యాంగ్ లీడర్'లో నటిస్తోన్న ప్రియాంక అరుల్ మోహన్ ను అఖిల్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదట. ఇక అఖిల్ సరసన దాదాపు కొత్త హీరోయిన్ నే ఫైనల్ చేస్తారని కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి. నిజానికి కొత్త అమ్మాయి వైపే మొగ్గు చూపారట దర్శక నిర్మాతలు. కాకపోతే ఆ కొత్త హీరోయిన్ అఖిల్ బాబుకు నచ్చలేదు. అందుకే రష్మికా మండన్న వైపు మొగ్గు చూపాడు అఖిల్.
దాంతో వచ్చే నెల మొదటి వారంలో చేయబోయే షెడ్యూల్ లో హీరోయిన్ రష్మిక కూడా పాల్గొంటాడట. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం పరుశురామ్ - అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. పరుశురామ్ అఖిల్ కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరి 'గీత గోవిందం'తో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న పరుశురామ్ అఖిల్ తో చేయబోయే తన తరువాత సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.