ప్రస్తుతం ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విషయం ఇంకా కోర్టులో ఉండగానే .. హీరోయిన్ శృతిపై ఓ కేసు ఫైల్ అయింది. శృతిపై రూ. 5కోట్ల పరువునష్టం దావా కేసు కింద కేసు ఫైల్ చేశారు. శృతి పై పరువు నష్టం దావా కేసు ఎవరు వేశారనేగా మీ అనుమానం .. ఆ కేసు వేసింది ఎవరో కాదు .. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్? ఉద్దేశ పూర్వకంగానే తన తండ్రి పరువును బజారుకు ఈడుస్తుంది అంటూ శృతిపై ఆమె కేసు ఫైల్ చేసింది.
అయితే.. అర్జున్ కూతురు పిటిషన్ పై శృతి హరిహరన్ కోర్టుకు వెళితే అక్కడ నిరాశే ఎదురైంది. ఈ కేసులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేయడంతో శృతి కథ అడ్డం తిరిగింది. మొత్తానికి ఎదో చేద్దామని అనుకున్న శృతి కి మరో గట్టి దెబ్బ తగిలేలా ఉందని సినీజనాలు అనుకుంటున్నారు. ఇకపోతే తమిళంలో అగ్ర హీరోగా వున్న అర్జున్.. అపుడప్పుడు తెలుగు లో కూడా మెరిశాడు. తమిళంలో ఆయన నటించిన జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు చిత్రాలు తెలుగులో ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అలాగే తెలుగులో స్ట్రయిట్ గా పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు. తన పనేంటో తాను చేసుకొని పోయే అర్జున్ పై ఇలాంటి వార్తలు రావడంతో ఇండస్ట్రీ జనాలతో పాటు, అభిమానులు కూడా విస్తుపోతున్నారు.