టాలీవుడ్ సెన్షేష‌న‌ల్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మూవీకి సంబంధించి సోష‌ల్ మీడియాలో రోజుకో వార్త తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వివ‌రాల‌ను మీడియాకు తెలిపిన ద‌ర్శ‌క నిర్మాతలు షూటింగ్‌ను ఇంకా ప‌ట్టాలెక్కించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు పూరీ త‌న మాస్ ఎలిమెంట్స్‌తో ఫైట‌ర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది.
                                                                                     
డైరెక్ట‌ర్ పూరీ సినిమాలో అద్దే మాస్ మ‌సాలాకు హీరో విజ‌య్ క‌రెక్టుగా స‌రిపోతాడ‌ని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే ఈ సినిమాలో విజ‌య్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఇస్మార్ శంక‌ర్‌కు మించి మాస్ మ‌సాలాతో చాలా బ‌లంగా ఉండ‌బోతుంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో మాస్ ఆడియ‌న్స్‌పై ఎక్కువ దృష్టి సారించిన పూరి ఈ సినిమాలో మాత్రం అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి మాదిరి మాస్‌తోపాటు ఎమోష‌న‌ల్ ట‌చ్ కూడా ఇచ్చేందుకు పూరీ సిద్ధ‌మ‌వుతున్నాడు.
                                       
మ‌రోప‌క్క ద‌ర్శ‌కుడు పూరీ త‌న మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు త‌గ్గ‌ట్టు హీరోయిన్ల సెల‌క్ష‌న్‌ను ఇప్ప‌టికే పూర్తి చేశాడు. స్క్రిప్ట్ వ‌ర్క్‌ను దాదాపు ఫైన‌ల్‌కు తీసుకొచ్చేశాడు. కాక‌పోతే విజ‌య్ క్యారెక్ట‌రైజేష‌న్‌కు త‌గ్గ‌ట్టు చిన్న చిన్న ఎలిమెంట్స్‌ను ప్ల‌స్‌లు, మైన‌స్‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం.
                       
దీంతో ద‌ర్శ‌కుడు పూరీ, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌ది టాలీవుడ్‌లోనే ఓ క్రేజీ కాంబినేష‌న్ అని, వీరి కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందంటూ చిత్ర‌పురి కాల‌నీ వాసులు చెబుతున్నారు.
             
ఇస్మార్ట్ శంక‌ర్ త‌రువాత పూరీ తీస్తున్న త‌దుప‌రి చిత్రం కావ‌డంతో ఆ రేంజ్‌లోనే ఫైట‌ర్‌పై ఉండ‌నున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: